ప్రభుత్వ ఈఎన్టీ డాక్టర్కు సన్మానం
కామారెడ్డి జులై 20 ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చెవి,ముక్కు, గొంతు. స్పెషల్ డాక్టర్ బండారి భరద్వాజ్ ని సన్మానించిన సమాచారకు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు. సోమవారం రోజున కామారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బండారి భరద్వాజ్ ఎం.బి.బి.ఎస్., ఎం.డి. చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యుడు డి. రామచందర్ కు ముక్కు తో బాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్న పేషెంట్ ను చికిత్స చేసి ఆపరేషన్ ద్వారా కేవలం ఒక్క రోజులోనే ప్రత్యేక చేసి సరికొత్త విధానంతో శస్త్రచికిత్స చేసి న ఘనత డాక్టర్ భరద్వాజ్ కి దక్కిందని తెలియజేస్తూ...,
కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని అనేకమంది పేద ప్రజలకు, చెవి ముక్కు గొంతుతో బాధపడుతున్న రోగులకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకుగాను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తరఫున కామారెడ్డి జిల్లా ప్రతినిధులు, రాష్ట్ర డైరెక్టర్ ఏం ఏ సలీం ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎం. రాజన్న కామారెడ్డి జిల్లా సలహాదారు టి. రామచందర్ మహిళా జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, జిల్లా ప్రతినిధులు ఎం సుధాకర్, రాజు,ప్రదీప్ కుమార్, గౌరీ తదితరులు పాల్గొన్నారు.






