షాద్నగర్ డిపోలో అద్దె బస్సుల యజమానుల సమ్మె
21-07-2026 10:35 AM
షాద్నగర్: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) షాద్నగర్ డిపోలో(Shadnagar depot) అద్దె బస్సుల యజమానులు సమ్మె చేస్తున్నారు. డిపో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని డ్రైవర్లు, యజమానులు నిరసన తెలిపారు. అద్దె బస్సు డ్రైవర్ల సమ్మతో ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో బస్ స్టాండ్(Bus stand) భారీగా ప్రయాణికులు బస్సులు కోసం ఎదురుచూస్తున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లు నిబంధనలు పాటించట్లేదని ఆర్టీసీ అధికారులు ఆరోపిస్తున్నారు.






