13-06-2025 12:00:00 AM
విశ్వహిందూ పరిషత్
ఖైరతాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : గో హత్య నిషేధ చట్టాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫల మైందని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ తెలిపింది. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో నాయకులు రావినూతల శశిధర్, రామరాజు, రమే ష్, జగదీశ్వర్, చింతల వెంకన్న, పగుడాకుల బాలస్వామి హాజరై మాట్లాడారు. మజిలీస్ పార్టీ మెప్పు పొందేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు.
ఇటీవల జరిగిన బక్రీద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అవలంబించిన తీరు హిందూ మనోభావాలను దెబ్బతీశాయన్నారు. గో రక్షణ కోసం ఏర్పాటుచేసిన చెక్ పోస్టులు విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా గోవు ప్రేమికులైన దళితులపై దా డి చేసి తీవ్రంగా హింసించారని, పోలీసులు వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు హిందువులను తీవ్రంగా కలిసి వేశాయని అన్నారు. హిందూ, దళిత వ్యతిరేక విధానాలపై జరుగుతున్న అనేక వ్యవహారాలన్నీ దృష్టిలో ఉంచుకొని న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు జస్వంత్, అనిల్, దీపక్, ఎస్సీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్, నాయకులు సుమన్, అరవింద్, ఉప్పల నరసింహ, ధీరజ్ పాల్గొన్నారు.