calender_icon.png 22 November, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహాల్లో చలికి వణుకుతున్న విద్యార్థులు పట్టించుకోని ప్రభుత్వం

22-11-2025 09:49:08 PM

- పేద విద్యార్థులుగా పుట్టడం పాపమా ? ప్రభుత్వ నిర్లక్ష్యమా?

- ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్

మునుగోడు,(విజయక్రాంతి): పేద విద్యార్థుల వసతి గృహాల్లో చలికి వణుకుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పేద విద్యార్థులు పుట్టడం పాపమా?ప్రభుత్వ నిర్లక్ష్యమా అని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడు కంభంపాటి శంకర్ అన్నారు. మండల కేంద్రంలోని విద్యార్థుల వసతి గృహాలను సందర్శించి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్ర రూపం దాల్చడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు  విద్యార్థీనిలు సరైన సొంత భవనాలు లేక హాస్టల్ విద్యార్థులు గురుకుల విద్యార్థులు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులను ఉండే రూములకు తలుపులు లేక కిటికీలు లేక వసతి పొందుతున్న విద్యార్థులు అనేకవస్థలు పడుతూ తీవ్రమైన చలికి వనికి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తక్షణమే నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రభుత్వంతో చర్చించి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు చలికి తట్టుకునే  దుప్పట్లను రగ్గులు విద్యార్థులకు ఉన్ని స్వెటర్లు అందించే విధంగా ప్రభుత్వం తో గాని,జిల్లా కలెక్టర్ గారి స్పెషల్ గ్రాంట్ తో  పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులను తీవ్రమైన చలి నుండి కాపాడాలని విద్యార్థుల తరఫున కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

విద్యార్థులు వసతి గృహాల్లో, గురుకులాల్లో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు ఉదయం చన్నిటిస్నానాలు చేయడం ద్వారా జలుబు దగ్గు జ్వరం బారానా విద్యార్థుల హాస్పిటల్ పాలవుతున్నారని  అన్ని వసతి గృహాలు, పాఠశాలలో విద్యార్థుల కు వేడి నీటిని ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ గత ప్రభుత్వ మాదిరిగా రగ్గులను స్వెటర్లను అందించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.