వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం
07-05-2026 01:31 PM
చౌటుప్పల్, మే 7(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి ధాన్యం కొనుగోలు ఆలస్యంపై రైతులను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఏటువంటి బాధ లేదని ఈ ప్రభుత్వంలో యూరియా, రైతుబంధు, సాగునీరు, పండిన పంటను అమ్ముకోవాలన్న ఇబ్బందికరంగానే ఉందని అన్నారు. అక్కడ ఉన్న రైతుల సమస్యలు అడగగా సుమారు 24 రోజులు అవుతున్న వడ్లు కొనే దిక్కు లేదు, మ్యాచర్ పాసైన వడ్లు జోకే నాథుడు లేడు, అలాగే తరుగు పెడితే బస్తాకు మూడు కిలోల కోత పెడుతున్నారని వాపోయారు.






