07-06-2025 10:36:55 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ఏరియాలో ప్రభుత్వ నిషేధిత గుడుంబాను పట్టుకోవడం జరిగిందని పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్(SI Rajasekhar) తెలిపారు. ఫిల్టర్ బెడ్ ఏరియాలో గుడుంబా అమ్ముతున్నారనే విశ్వసినీయ సమాచారం మేరకు పట్టణ ఏఎస్ఐ మల్లేష్ తో కలిసి ఫిల్టర్ బెడ్ ఏరియాలోని బానోతు కమల అనే మహిళ ఇంటి పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా, సుమారు 6 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబా లభ్యమయిందన్నారు. దానిని పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.