07-06-2025 10:38:39 PM
మందమర్రి (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) పట్టణ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్ తెలిపారు. పట్టణంలోని బిఎంఎస్ కార్యాలయంలో శనివారం బిజెపి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ ఇంచార్జ్ సంజీవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ నూతన కమిటీని నియమించారు. పట్టణ ప్రధాన కార్యదర్శులుగా రంగు శ్రీనివాస్, కర్రావుల వినయ్, ఉపాధ్యక్షులుగా శనిగరం శ్రీనివాస్, రాజేందర్, ఓదెలు, తిరుపతి, కోశాధికారి గా సంతోష్, కార్యదర్శులుగా సరోజ, రాజేంద్రప్రసాద్, సత్యం బాబు, పార్వతీ లను నియమించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు డివి దీక్షితులు, నాయకులు రొడ్డ మోహన్, భూపతి లు పాల్గొన్నారు.