calender_icon.png 18 June, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకల ఏర్పాట్లతో సర్కారు స్కూళ్లు!

13-06-2025 12:00:00 AM

డాక్టర్ ఎస్.విజయభాస్కర్ :

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ప్రభుత్వ, పంచాయతీ రా జ్, మోడల్ స్కూ ల్, రెసిడెన్షియల్ బడులలో నాణ్యమైన విద్యను బోధిస్తున్నారని, అనుభవం కలిగిన, ఉన్నతోన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు ఉన్నారని ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను సర్కార్ బడులలో చేర్పించడానికి కృషి చేస్తున్నారు.

ప్రభుత్వ, పంచాయిత్‌రాజ్ బడులలో ఆంగ్ల మాధ్యమంలో వి ద్యాబోధన జరుగుతుందని, కంప్యూటర్ లు, ఐపీబీ ద్వారా డిజిటల్ సాంకేతిక పద్ధతులలో ఉత్తమమైన విద్యను బోధిస్తున్న ట్లు అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు తెలియజేస్తూ 2025--26 విద్యా సంవత్సరంలో సర్కార్ బడులలో ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రణాళికలు రూపొం దిస్తున్నారు.

సర్కార్ బడులకు, ప్రైవేటు బడులకు వ్యత్యాసం తెలియజేస్తూ బ్యాన ర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్న పద్ధతిలో విద్యార్థులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సర్కార్ బడులలో ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు ఇస్తున్నారని, ఉచితంగా ఫీజు లేకుం డా నాణ్యమైన విద్యను బోధిస్తున్నారని, ఉచితంగా యూనిఫాం ఇస్తున్నామని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయ సదుపాయం, సైన్స్ ల్యాబ్, సోషల్ తెలంగాణ రాష్ట్ర, భారతదేశ, ప్రపంచ పటాలు ఉన్నాయని, విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు, పాటలలో తీర్చిదిద్దడానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌లు ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి పర్యవేక్షణలో!

రాష్ట్రంలోని 33 జిల్లాలకు 2025--25 సంవత్సరానికి కావాల్సిన పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫాంలు వేసవి సెల వుల్లో ప్రభుత్వ బడులకు చేరిపోయాయి. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పు నఃప్రారంభమైన నేపథ్యంలో అందరు వి ద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూ నిఫాంలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యం లో రాష్ట్రంలోని 33 జిల్లాలలో పని చేస్తున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు, ప్రధా న ఉపాధ్యాయులకు, ఎంఈఓలకు, డీఈఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యను అందించడానికి, ఎన్‌రోల్‌మెంట్ పెంచడానికి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలను పెం పొందించుకోవడానికి డిజిటల్, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు అనుగుణంగా ప్రభు త్వ బడులలో ఆకర్షణీయమైన అద్భుతమైన ఆనందదాయకంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యను అ భ్యసించడానికి ఉపాధ్యాయులు ఏ విధం గా తోడ్పాటు అందించాలనే విషయాలను ఈ శిక్షణ కార్యక్రమాల్లో బోధించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రభు త్వ, పంచాయతీరాజ్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. తెలంగాణలోని అన్ని శాఖలకు మంత్రులను కేటా యించి విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించడానికి కృషి చేయాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. 

విద్యాశాఖకు విద్యాశాఖ కమీషన్, ఛైర్మ న్, సభ్యులను ఏర్పాటు చేసి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలలకు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట తీర్చిదిద్దారు. పురాతన భవనాలలో నడిచే ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలకు మరమ్మతులు చేయ డం, నూతన భవనాలను, తరగతి గదులను అదనంగా ఏర్పా టు చేయడం, కరెంట్, నీటి సౌకర్యం, మ రుగుదొడ్లు కల్పించడం, ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల భవనాలకు పెయిం టింగ్ చేయడం లాంటివి చేసి కొత్త రూపు వచ్చేటట్లు తీర్చిదిద్దారు.

గత ప్రభు త్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాలలను, విద్యార్థులకు కులాల పరం గా, మతాల పరంగా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్ కులాల పరంగా, మతాల పరంగా కాకుండా అంద రు విద్యార్థులు ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌లను ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్నది.

గతంలో రెసిడెన్షియల్ పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తూ ఇంటి యజమానులు ఎప్పుడు ఖాళీ చేయమంటరో అంటూ బిక్కు బిక్కుమంటూ చదువుకునే వారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌లకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం స్వంత భవనాలను ఏర్పాటు చేసింది.

కామన్ విద్యావిధానం కావాలి

రాష్ట్రంలో కామన్ విద్యావిధానం ఉం డాలని అనేక మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. ప్రభుత్వ, పం చాయతీరాజ్, మోడల్ స్కూల్‌లు, ఎయిడెడ్ స్కూల్‌లు, స్పోర్ట్స్ స్కూల్‌లు, రెసి డెన్షియల్ స్కూల్‌లు, నవోదయ స్కూల్ లు, పబ్లిక్ స్కూల్‌లు, మైనారిటీ స్కూల్ లు, క్రిష్టియన్ మైనారిటీస్ స్కూల్‌లు అం టూ వేరువేరుగా ఉండడం వల్ల అనేక ఇ బ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు కలిపి కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేస్తే అందరికీ ఉపయోగక రంగా ఉంటుందని ఉపాధ్యాయు లు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నా రు.

విద్యార్థులకు వేసవి సెలవుల్లో సమ యం వృథా కాకుండా తెలంగాణ ప్రభు త్వం ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించింది. ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్, ఆట లు, పాటలలో ప్రత్యేకంగా శిక్షణను ఏర్పా టు చేసి విద్యార్థులను అనేక రంగాల్లో తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6 నుంచి 19 వరకు బడిబాట పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రభుత్వ బడులలో విద్యార్థుల సం ఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నారు.

తద్వార తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభు త్వ, పంచాయతీరాజ్ పాఠశాలల పట్ల ఆకర్షితులు కావడానికి అవకాశం ఉంది. తెలంగాణ అన్ని ప్రభుత్వ బడుల ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం, బదిలీలు చేయడం, ఉపాధ్యాయులు లేని చోట వారిని సర్దుబాటు చేయడానికి జిల్లా కలెక్టర్‌లకు వర్క్ అడ్జెస్ట్‌మెంట్ అధికారాలు ఇవ్వడం వంటివన్నీ పూర్తి చేశారు.

తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు తప్పనిసరిగా తెలుగును అభ్యసించాలనే ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా సంవత్సరం పునః ప్రారంభం కంటే ముందే అన్ని ఏర్పాట్లు చేయడం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు సర్కార్ బడులలో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం ఏర్పడుతున్నది.

 సెల్: 9290826988