calender_icon.png 18 June, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార సాధనతోనే సామాజిక న్యాయం

13-06-2025 12:00:00 AM

సంపతి రమేష్ మహరాజ్ :

* అన్ని పార్టీలు ఈ సామాజిక న్యాయసూత్రాన్ని పాటించాలి. తెలంగాణలో మెజార్టీ నామినేటెడ్ కార్పొరేషన్ పదవులనుఒక సామాజిక వర్గానికే కట్టబెట్టారు. ఉన్నత అధికారులు, కాంట్రాక్ట్‌లలో సైతం తమకు అనుచరులుగా ఉండే అగ్రకులాలవారినే నియమించుకుంటున్నారు.

అనాదిగా భారతదేశ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ లు అట్టడుగులోకి నెట్టబడ్డారు. సామాజిక వివక్ష, కుల కట్టుబాట్ల మధ్యలో నలిగిపోయారు. నిరంతరం అణిచివేతకు గురై ఆత్మగౌరవం లేకుండా జీవించారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా వీరి జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదు. అగ్రకుల ఆధిపత్యమే కొనసాగింది. మెజార్టీగా వీరు ఉన్నప్పటికీ సాధికారతకు దూరంగానే ఉన్నారు.

ముఖ్యంగా ఈ దేశ రాజకీయా లు, విద్య ఉద్యోగాలలో, సంపదలో ఇప్పటికీ వెనుకబడటమే దీనికి కారణం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ జీవితాల్లో కొంత మార్పు మొదలైంది. ఈ క్రమంలో ఈ వర్గాలకు పరి మిత విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశా లు లభించాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలలో వారి జనాభా దామాషా ప్రకారం రాజకీ య అవకాశాలు కూడా లభించాయి. దీం తో కొంత చైతన్యం ప్రారంభమైంది.

దీనిద్వారా ఆధిపత్య వర్గాలపై ధాక్కార స్వరం ప్రారంభమైనా పదవుల కోసం పెదవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా స్వతంత్ర భారతదేశంలో అగ్రకులాల కుట్రలకు ఏదో రూపంలో అణగా రిన వర్గాలు బలై పోతున్నారనేది వాస్తవం. ఓటు బ్యాంకు రాజకీయాల్లో ప్రజల చైత న్యం, పోరాటం, ఆత్మగౌరవం బందీ అయిపోతున్నాయి. ఇది ఏళ్ల తరబడి నుంచీ కొనసాగుతున్న సత్యం. 

ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలో 1980వ దశకంలో కాన్షీరాం బహుజన ఉద్యమంతో బడుగు, బలహీన వర్గాలలో అణచివేతకు వ్యతిరేకంగా విముక్తి పోరా టం మొదలైంది. బుద్ధుడు, పూలే, అంబేద్కర్‌ల సామాజిక, రాజకీయ ఉద్యమం తెరమీదకి వచ్చింది. ఈ క్రమంలో బలహీన వర్గాలలో రాజకీయ స్పృహ ప్రారం భమైంది. ‘ఓటు హమారా! రాజ్ తుమా రా!’ అనే ప్రశ్న మొదలైంది.

ఇది దేశ రాజకీయాలను కదిలించింది కూడా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏ సీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ నేతృత్వంలో దేశంలో మా కులాల వాటా ఏదని ప్రశ్నించడం మొదలైంది. రాజ్యాంగం ప్రకారం హక్కుల్ని, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభావంతో పలు సభల్లో, వేదికల దగ్గర 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు తమకు రావాల్సిన వాటాలపై వారిలోని మేధావి వర్గం కూడా ప్రశ్నిస్తుంది. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతున్నది.

రాజకీయ అవసరం..

భారత రాజ్యాంగం కల్పించిన హక్కు లు, స్వేచ్ఛతో వెనుకబడిన వర్గాలలో బానిసత్వ విముక్తికై పోరాటం మొదలైంది. ఇది పరోక్షంగా అగ్రకుల రాజకీయ పార్టీల వ్య తిరేకంగా అభిముఖ పోరాటమే. ఇది అగ్రకులాల రాజకీయ పార్టీలకు మింగుడు ప డటం లేదు. సబ్బండ వర్గాలను కలుపుకోకపోతే తమ ఉనికి ప్రశ్నార్థకం అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ వర్గాలు లేకపోతే ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేమనీ, ప్రభుత్వాలు సైతం నిలబడే పరిస్థితి లేదని  తెలిసి వస్తుంది. 

దేశవ్యాప్తంగా ఎవరమెంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతం మరింత బలపడుతున్నది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ద్వారా కులాల స్థితిగతుల అధ్యయనానికి తెరలేపింది. దీన్ని ఆచరణాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా బీసీ వర్గాలకు అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే స్థానిక సంస్థలు, ఉద్యోగాలలో బీసీల కు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. ఈ బిల్లును కేంద్రా నికి పంపింది. ఈ బిల్లు ఆమోదం ఎంతవరకు సాధ్యమో చూడాలి. 

మరోవైపు దళితుల్లో కూడా వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం చేకూర్చాలని 30 ఏళ్లనుంచి సుదీర్ఘ పోరాటం సాగింది. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మాల మాదిగల కులాల సమస్యలకు ముగింపు పలికింది. ఈ ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన సామాజిక కోణా న్ని చూపెట్టుకునే ప్రయత్నం చేసింది. దశాబ్దాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం సామాజిక న్యాయం దిశగా అడుగు లు వేయాల్సిన గత్యంతర పరిస్థితి ఏర్పడింది.

అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సైతం జనగణనతోపాటు కులగణన  చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇది ఒక ప్రజా డిమాండ్‌గా ముందుకెళ్లడంతో కేం ద్రం ఆ దిశగా అడుగులు వేయక తప్పలేదు. అంటే, కులాల వాటా ప్రకారం అవకాశాలు కల్పించాలనే ప్రజా డిమాండ్‌ను రాజకీయ పార్టీలు తమ ఎజెండాగా ముందుకు తీసుకెళుతున్నాయి. 

ఇది ఒక రాజకీయ అవసరంగా కూడా మారింది. మొత్తంగా అటు ప్రజల డిమాం డ్, ఇటు రాజకీయ పార్టీల అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలు పంథా మార్చుకుంటున్నాయి. మతతత్వ హిందూ ఎజెండా తో నడిచే బీజేపీ, సెక్యులరిజం ఎజెండాతో కాంగ్రెస్ పార్టీలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీల ఎజెండానే ఎత్తుకున్నాయి. తమ రాజకీయ ఉనికి కోసం చేపట్టిన ఈ సిద్ధాంతాలతో ప్రజలు కన్ఫ్యూ జ్ అవుతున్నారు. మరి, అంతిమంగా ఈ సోషల్ జస్టిస్ క్షేత్రస్థాయిలో విజయవంతం అవుతుందా? లేదా ఒక మిథ్యగానే మిగులుతుందా? చూడాలి. 

సహజ న్యాయసూత్రం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మార్క్ మంత్రివర్గ విస్తరణలో కూడా కనబడింది. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌లో రెడ్డి ఎమ్మెల్యేల ఆధిప త్యం ఉన్నప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. త ద్వారా ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ తమ రాజకీయ అవసరాల నిమిత్తం సామాజిక కో ణాన్ని చూపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇది మంచి పరిణామమే. ఈ మార్పులతో రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు పదవులు లభించినా అధికారాలు ఇస్తా రా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

అన్ని పార్టీలు ఈ సామాజిక న్యాయసూత్రాన్ని పాటించాలి. తెలంగాణలో మెజార్టీ నామినేటెడ్ కార్పొరేషన్ పదవులను రెడ్లకే కట్టబెట్టారు. ఉన్నత అధికారు లు, కాంట్రాక్ట్‌లలో సైతం తమకు అనుచరులుగా ఉండే అగ్రకులాల వారినే నియ మించుకుంటున్నారు. మరి, ఇదెక్కడి సా మాజిక న్యాయం అవుతుందో ఒకసారి ఆ లోచించాలి. దేశం, రాష్ట్రాలు కులగణన చేయడమే కాదు, వారి వాటా ప్రకారం అధికారం, అవకాశాలు కల్పించాలి. 

అప్పుడే కులగణన సిద్ధాంతానికి అర్థం. కానీ, బడుగు బలహీన వర్గాలకు పదవు లు, అధికారం ఇస్తున్నట్టు అగ్రకుల పార్టీ లు కపట ప్రేమ చూపితే మాత్రం మూ ల్యం చెల్లించక తప్పదు. తెలంగాణలో 0.5 శాతం ఉన్న వెలమలు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు 5 శాతం ఉన్న రెడ్లు పాలిస్తున్నారు.

మరి, 90 శాతం ఉన్న బిసీ, ఎస్సీ, ఎస్టీలు ఎప్పుడు పాలించాలో ఒకసారి ఆలోచించండి. ఈ దేశ నిర్మాణంలో తమ రక్తమాంసాలు ధారపోసిన ఈ వర్గాలు అధికారంలోకి వచ్చినప్పుడే భూమి, సంపద, విద్యా, ఉద్యోగాలలో వారి జనాభా ప్రకారం వాటా దక్కినట్టు. ఓటు చైతన్యంతోనే ఇది సాధ్యం. అప్పుడే సమసమాజ నిర్మాణం జరగాలని కోరుకునే అంబేద్కర్ ఆశించిన భారత రాజ్యాం గ లక్ష్యం నెరవేరుతుంది. 

వ్యాసకర్త సెల్: 7989578428