19 April, 2026 | 1:59 PM

ప్రభుత్వం ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

02-12-2024 07:57 PM

భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు నారెడ్డి వెంకటరెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ అధ్యక్షుడు నారెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేటలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీల ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రెండు లక్షల అరుణమాఫీ చేయాలని అదేవిధంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూడకుండా రుణమాఫీ రైతు భరోసా రైతులకు తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సాంగ్ ప్రతినిధులు గోపు శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.