calender_icon.png 12 November, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: నరసింహారావు

12-11-2025 09:04:55 AM

మోతె: మండల పరిధిలోని మామిల్లగూడెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఎస్కే సైదులు గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటనపై తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ & లెక్చరర్స్ ఫెడరేషన్, టి పి టి ఎల్ ఎఫ్ సంతాపం తెలిపింది. టి.పీ.టి.ఎల్.ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జే. నరసింహారావు మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులు విద్యారంగానికి వెన్నుముక లాంటివారని. మరణించిన ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయుని కుటుంబానికి ప్రభుత్వం కనీసం ₹25 లక్షల పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సైదులు  కుటుంబానికి టి.పీ.టి.ఎల్.ఎఫ్ తరఫున దాన సంస్కారాలకు  ఆర్థిక సహాయం అందజేశారు. సైదులు కుటుంబానికి ఫెడరేషన్ పూర్తిగా అండగా ఉంటుందని నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్కే జానీ మియా, జిల్లా కార్యదర్శి ఎం. వీరయ్య, సఫియా, సైదులు, జానీ పాషా, సునీల్, అజ్జు, అజ్జు భాయ్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.