07-02-2026 12:00:00 AM
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎల్బీనగర్, ఫిబ్రవరి 6 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం ఆందిస్తే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితం అవుతుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేయకుండా ప్రకృతితో కలిసి జీవిస్తే వ్యాధులను నివారించొచ్చు.. ఆరోగ్యమైన మనుషులు ఉన్నప్పుడే.. దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందని, తద్వారా వికసిత్ భారత్ సాధ్యమవుతుంది’ అన్నారు.
శుక్రవారం మన్సూరాబాద్ డివిజన్లో ఏర్పాటు చేసిన ‘వెల్నాక్స్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్’ ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జీహెచ్ఎంసీ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహరెడ్డి, సెంటర్ ఎండీ డాక్టర్ స్వాతి ప్రత్తిపాటి, డాక్టర్ సిద్ధార్థ్ సాయి, కామినేని ఎండీ శశిధర్ , ఆర్ఎస్ఎస్ ఏపీ ప్రాంత సంఘ్చాలక్ సుందర్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.