calender_icon.png 13 June, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఉద్యోగులకు జిపిఎఫ్ వర్తింపచేయాలి

12-06-2025 08:29:55 PM

ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కు వినతి

కామారెడ్డి జిల్లాలోని విద్యుత్ శాఖ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ

కామారెడ్డి (విజయక్రాంతి): విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల మాదిరిగా జిపిఎఫ్ ను ప్రభుత్వం వర్తింపచేయాలని కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao)కు గురువారం రెడ్డిలో వినతి పత్రాన్ని అందజేశారు. శాఖ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ని కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

 విద్యుత్తు ఉద్యోగులకు 2019 నుంచి 2024 మధ్య వారికి మిగతా ప్రభుత్వ శాఖల లాగా జిపిఎఫ్( OPS) వర్తింపచేయాలని కోరారు.  ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  సానుకూలంగా స్పందించి తాను కూడా ఈ విషయమై ప్రభుత్వ అధికారులతో ప్రజా ప్రతినిధులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కమలాకర్, ప్రదీప్ కుమార్, మెహర్ బాబా, సురేందర్, వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి,ఉద్యోగులు పాల్గొన్నారు.