12-06-2025 08:31:29 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అనుమతి లేకుండా పాఠశాలలో నడుపుతూ పేద విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు రాబడుతున్నారని వాటిపై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్(SFI District Convener Digambar) తెలిపారు. గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు కలిసి వినతి పత్రం అందజేశారు. నిర్మల్ బైసా ఖానాపూర్ ముధోల్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జగన్ విద్యార్థులు ఉన్నారు.