calender_icon.png 13 June, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయండి

12-06-2025 08:28:09 PM

సీఐటీయూ..

ఇల్లెందు (విజయక్రాంతి): ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(RTC Staff and Workers Federation) రాష్ట్ర 4వ మహాసభలు జూన్ 21,22 తేదీలలో ఖమ్మం నగరంలో జరుగుతున్న నేపధ్యంలో గురువారం  ఉదయం ఇల్లందు ఆర్టీసీ డిపో వద్ద ఆహ్వాన సంఘం కరపత్రాలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆర్టీసీ ఇల్లందు డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి, డిపో కార్యదర్శి జే ఉపేంద్ర చారిలు పాల్గొని మాట్లాడుతూ..  తెలంగాణ ఆర్టీసీ ఏర్పడ్డ నాటి నుండి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైన ఎస్ డబ్ల్యు ఎఫ్ స్పందిస్తున్నది అంతే కాకుండా ఆ సమస్యల పరిష్కారానీకి తనవంతుగా పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలు, ప్రజలు, ప్రభుత్వం, యాజమాన్యాల ముందు ఉంచి వాటి అమలుకై ఆందోళనా పోరాటాలు చేస్తోందన్నారు.

గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్షి పథకం లో సాధక, బాధకాలు, లాభ నష్టాలపై ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాలు చూపుతూ ఆర్టీసీ పరిరక్షణకు సహకరిస్తున్నదని  తెలిపారు. 1980 లో ఆర్టీసీ రాష్ట్ర ప్రథమ మహాసభలు ఖమ్మం నగరంలో జరిగాయని మళ్లీ ఇంతకాలానికి ఖమ్మం నగరంలో జరుగుతున్నాయని ఈ మహాసభల జయప్రదం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి, అంజి, కృష్ణ, నసీరుద్దీన్, పీ ఎల్ రావు సయ్యద్ అలీ, కోటయ్య,  సీ ఎస్ రావు, ఎస్కే బాషా, కాంతారావు, పీ ఎస్ నారాయణ, లక్ష్మీ భవాని తదితరులు పాల్గొన్నారు.