17-05-2025 12:00:00 AM
ఊరంతా మద్యం దుకాణాలే..
ఇష్టానుసారంగా తిరుగుతున్న మద్యం ప్రియులు
బస్టాండ్లో ప్రయాణికులకు దర్శనమిస్తున్న మద్యం సీసాలు
పర్యవేక్షణ లేని పంచాయతీ అధికారులు
కరువైన పోలీసుల పెట్రోలింగ్
గోపాలపేట, మే 16: గత ప్రభుత్వ హ యాంలో బుద్ధారం బస్టాండ్ పరిసరాలు వీ ధిలైట్లతో పండు వెన్నెల కళకళలాడేది. ప్రస్తు తం గ్రామపంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేక బుద్ధారం పరిసరాలు అంధకారం నెలకుంది. ఇదే ఆసరాగా ఉన్న మద్యం ప్రి యులకు బుద్ధారం బస్టాండ్ తాగుబోతుల అడ్డాగా మార్చుకున్నా వైనం వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో దర్శనమిస్తుంది.
గ్రామ పంచాయితీకి పది అడుగుల దూరం ప్రధాన రహదారిపై ఉన్న బస్టాండ్ అంధకారంలో నెలకొన్న నేటికి ఏ అధికారి పర్యవేక్షణ లేకపోవడం పాలన ఎంత దుర్భరంగా ఉందో అర్థమవుతుందని పలువురు వాపోతున్నారు. ఇంతే కాకుండా బుద్ధారం గ్రామంలో ఊరంతా మద్యం దుకాణాలు తాండవిస్తున్నాయి. ప్రతి కిరా ణం కొట్టులో కూడా మద్యం సీసాలు పలువురికి దర్శనం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది.
మండల కేంద్రంలో ఒక్క వైన్ షాప్కి ఒక్క బుద్ధారం గ్రామంలోనే సుమారుగా 50 దాకా బెల్టు షాపులు ఉండడం పలువురు ఇదేంటని ముక్కుపై వేలేసుకుంటున్నా రు. ఇక యువత నైతేనేమి కష్టపడి సా యంత్రం వేళ ఇంటికి వచ్చే కార్మికులేమీ ప్ర తి ఒక్కరు కూడా బుద్ధారం గ్రామంలో ఎటు చూసినా బెల్ట్ షాపులో ఉండడం పట్ల మద్యం ప్రియు లు సీసాలు కొనుగోలు చేసి నేరుగా హైదరాబాద్ వనపర్తి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న బస్టాండ్ను తాగడానికి అడ్డాగా మార్చు కున్నారు.
యువకులు బస్టాండ్లో తాగుతూ కాలక్షేపం చేస్తూ మద్యం సీసాలను అక్కడే పగలగొట్టడం విరగ్గొట్టడం గమనార్హం గా ఉంది. గ్రామపంచాయతీ అధికారులు సరైన పర్యవేక్షణ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా నుండి ఊరు చివరి వరకు వీరిలైట్లను ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి బస్టాండ్లు పాఠశాలలో తాగుబోతులకు అడ్డాగా మారకుండా ఉండేవని అక్కడి వాసులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా గతంలో పోలీసులు నిత్యం రాత్రి వేళలో పెట్రోలింగ్ చేసేవారు దీంతో తాగుబోతులు వారి ఇష్టానుసారంగా బస్టాండ్ ప్రాంతాల్లో తిరగకుండా జాగ్రత్తపడేవారు.
అంధకారంలో బస్టాండ్ ప్రాంతం
కానీ ఓ పక్క గ్రామపంచాయతీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం పట్ల ఆ బస్టాం డ్ ప్రాంతం అంధకారంలో నెలకొంది. దీంతో మద్యం ప్రియులు చీకటిని అదునుగా చేసుకొని బస్టాండ్లో మద్యం సీసాలు పెట్టుకుని తాగుతూ గొడవలు పడడం నృత్యాలు చేయడం జరుగుతుంది. మద్యం ప్రి యులు సీసాలు అక్కడే వదిలేయడం పట్ల ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.
ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులు పలు ప్రాంతాలకు వెళ్లేందు కు బస్టాండ్ ప్రాంతంలో వేచి ఉంటారు. కానీ ఈ బస్టాం డ్ ప్రాంతమంతా అందాకారంలో నెలకోల్డం పట్ల ఆకతాయిలకు అడ్డగా మా రింది. దీంతో మహిళలు భయభ్రాంతులకు గురై ఆ ప్రాంతానికి రోడ్డుపైకి రావాలం టే భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇకనైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి బస్టాండ్ ప్రాంతమంతా వీధిలైట్లు వెలిగేలా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అంతేకాకుండా ఊరంతా మద్యం దుకాణాలతో నిండిపోయిందని ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి బుద్ధారం గ్రామంలోని కిరాణా దుకాణాల్లో మద్యం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటే యువకులు మద్యానికి బానిసలు కాకుండా కాపాడిన వారవుతారని పోలీసులను కోరుతున్నారు.
అదేవిధంగా సంబంధిత పోలీస్ అధికారులు నిత్యం బుద్ధారం గ్రామంలో రాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తే మద్యం ప్రియులకు చెంప చెల్లుమన్నట్టుగా ఉంటుందని. అంతేకాకుండా తాగిన మైకంలో ఘర్షణలు కాకుండా ఉంటాయని గ్రామస్తులు కోరుతున్నారు.