17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భూ సేకరణ కోసం గ్రామసభలు

28-03-2025 01:45 AM

భీమదేవరపల్లి మార్చి 27 (విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోని కాలువల తవ్వకం కోసం భూమిని సేకరించేందుకు గ్రామ సభలు నిర్వహించారు. గురువారం భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్, ముల్కనూర్, వంగర గ్రామపంచాయతీ కార్యాలయాలలో గ్రామసభలు నిర్వహించడం జరిగింది .

ఈ సందర్భంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుండి వస్తున్న నీటికి కాలువల నిర్మాణం కొరకు భూమిని కోల్పోయిన రైతులు వారి పేర్లను హనుమకొండ ఆర్డీవో రమేష్ రాథోడ్ చదివి వినిపించారు. భూములు కోల్పోయిన రైతులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే భీమదేవరపల్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కు తెలియజేయాలన్నారు.

గ్రామసభలలో భీమదేవరపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్. వీరేశం, డి ఈ లావణ్య పంచాయతీ కార్యదర్శులు జంగం పూర్ణచందర్, గుడికందుల మధు, వినయ్ రైతులు పాల్గొన్నారు.