04-09-2025 11:07:29 PM
సదాశివపేట (విజయక్రాంతి): సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీ శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో గురువారం వినాయక నిమర్జనం ఘనంగా నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, ఆట పాటలు అక్కడ ఉన్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రమంలో శ్రీ రైజింగ్ కిడ్స్ కరస్పాండెంట్ హైమావతి, ప్రిన్సిపల్ స్వాతి, పాఠశాల ఉపాధ్యాయులు, సదాశివపేటలోని వివిధ పార్టీ నాయకులు, మునిపల్లి సత్యనారాయణ, కంది కృష్ణ, శంకర్ గౌడ్, చిరు,పిల్లోడి విశ్వనాథం ,తోట చంద్రశేఖర్, సదాశివపేట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.