calender_icon.png 29 June, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మనీ వైబ్ పుస్తకావిష్కరణ

29-06-2025 01:11:36 AM

హైదరాబాద్, సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి):  హైదరాబాద్ హైటెక్ సిటీ లోని కోకో రెస్టారెంట్‌లో ఆనంద్ మెహతా రచించిన మనీవైబ్ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రచయిత ఆనం ద్ మెహతా, మోడరేటర్ ప్రియా రాజీవ్, ప్యానలిస్టులు తాహేర్ అలీ బైగ్, మాధవి చంద్ర, కుటుంబ సభ్యులు, స్నేహితులు, నగరంలోని ప్రముఖ బ్లాగర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు హాజరయ్యారు.

మనీ వైబ్ పుస్తకం ఆర్థిక నిర్వహణపై గాఢమైన దృష్టిని కలిగి ఉండే ఒక ప్రాయోగిక మార్గదర్శిని. ఇందులో రచయిత గుజరాతీ వ్యాపార విలువల నుంచి స్ఫూర్తి పొంది ఆర్థిక వ్యూహాలను పాఠకులతో పంచుకున్నారు. ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే చిట్కాలను ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకం ఖర్చుల నిర్వహణ, పొదుపును గరిష్టంగా ఉపయోగించుకోవడం, సంపదను సృష్టించడం వంటి అంశాలపై సరళమైన, ప్రభావవంతమైన సాధనలను అందిస్తుంది.

‘డబ్బును తెలివిగా నిర్వహించగలగడం ఆర్థిక స్వేచ్ఛకు కీలక నైపుణ్యం’ అని రచయిత ఇందులో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యక్ష అనుభవాలు, విజయవంతమైన విధానాలు ఈ పుస్తకాన్ని మరింత విశ్వసనీయంగా చేసి, పాఠకులను వారి ఆర్థిక జీవితాన్ని మార్చుకునే దిశగా ప్రేరేపించాయి.