ఊరటనిచ్చిన వర్షం
30-06-2025 12:00 AM
నిర్మల్ జూన్ 29(విజయ క్రాంతి) : వానకాలం సీజన్లో రైతులు సాగుచేసిన పం టలకు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. జిల్లాలో తొలకరి వర్షాలకు రైతులు పత్తి సోయా మొక్కజొన్న పప్పు దినుసు పంటలు వేసుకోగా ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో అవి మొలకెత్తినప్పటికీ ఎదుగుదల లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.
అదే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలకు మేలు చేయడంతో రైతులు పంట భూముల్లో కలుపుతీత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లా కూలీలతో పాటు మహారాష్ట్ర కూలీలు రావడంతో పనులు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. మొక్కలు ఎదిగిన రైతులు రసాయన మందులను కూడా వాడుతున్నారు.






