17-01-2026 04:45:49 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): మండలంలోని గోంట్లపేట గ్రామం పెద్దవాగు రోడ్డు మార్గంలో వరిగడ్డి లోడ్ తో వస్తున్న ట్రాక్టర్కుకు విద్యుత్ తీగలు తగలడంతో వరి కట్టలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.