calender_icon.png 17 January, 2026 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లను అత్యంత పారదర్శకంగా ఖరారు

17-01-2026 05:00:31 PM

వనపర్తి,(విజయక్రాంతి): ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, సీప్-2024 సర్వే ఆధారంగా మున్సిపల్ ఎన్నికలకు వార్డుల వారీగా రిజర్వేషన్లను అత్యంత పారదర్శకంగా ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు.

లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, సీప్-2024 సర్వే జనాభా ప్రతినిథ్య ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలకు వార్డుల వారీ రిజర్వేషన్లను అత్యంత పారదర్శకంగా ఖరారు చేయడం జరిగిందని తెలిపారు.

నిబంధనల ప్రకారం వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలలో మహిళలకు కేటాయించాల్సిన వార్డులను లక్కీ డ్రా (Lot System) ద్వారా ఎంపిక చేశామన్నారు. రిజర్వేషన్ల ఖరారు అనంతరం గెజిట్ విడుదల చేసి, తదుపరి  జాబితా ప్రతులను కలెక్టరేట్ మరియు సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు, ప్రతినిధులు మరియు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.