భవన నిర్మాణానికి శంకుస్థాపన
25-02-2026 12:21 AM
మర్రిగూడ, ఫిబ్రవరి 24 : మండలంలోని కొండూరు గ్రామ సంఘ బంధం భవన నిర్మాణానికి గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం శంకుస్థాపన చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పది లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఏపీఎం తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అంబోతూ సీతారాం నాయక్ ఉప సర్పంచ్ జాల యాదయ్య ఎంపీడీవో జి సి మున్నయ్య పంచాయతీ కార్యదర్శి శ్రావణ కుమార్ ఏపిఎం వెంకట్ టి ఏ నరసింహ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




