17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నూతన ఆలయాల నిర్మాణానికి భూమి పూజ

22-02-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ డివిజన్లోని శ్రీ సాయి బాబా ఆలయ ప్రాంగణం లో నూతన ఆలయాల నిర్మాణానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గంగ పుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీకృ ష్ణుని గుడి నిర్మాణ పనులను ఆయన శనివారం ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడు తూ.. సమాజంలో భక్తి, సంప్రదాయం, సం స్కృతులను కాపాడటంలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  గంగ పుత్ర సం ఘం చేపట్టిన ఈ పవిత్ర కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆయ న ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగరాజు, భూతం సత్యనారాయణ, బాలకృష్ణ, గణేష్, సత్యనారాయ ణ, రఘు, బాబు రావు, లడ్డు, సంజోళ్ల అనిత, ప్రీతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.