01-10-2025 01:32:37 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ర్టం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులుకన్న కలలు గడచిన పది ఏళ్లలో కలలుగానే మిగిలాయని, ప్రజాప్రభుత్వం వారి కలలను నిజం చేస్తోందని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గ్రూప్--1 నియామకాల ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జిల్లా రిజిస్ట్రార్లుగా నియమితులైన పలువురు అభ్యర్థులు మంగళవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించి, మాట్లాడారు. ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తోందని, ఈ కీలక సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులపై గురుతరమైన బాధ్య త ఉందని తెలిపారు. ఉమ్మడి ఏపీలో కాం గ్రెస్ హయాంలోనే 2011లో గ్రూప్-1కు నోటిఫికేషన్ జారీ చేయగా, 2018లో భర్తీ ప్రక్రియ పూర్తయిందని గుర్తుచేశారు.
ఉమ్మ డి రాష్ర్టంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్--1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తే.. మీరేంది భర్తీ చేసేది, తెలంగాణ సాధించుకున్న తర్వాత స్వరాష్ర్టంలో మా ఉద్యోగాలను మేమే భర్తీ చేసుకుంటామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం శోచనీయమన్నారు.
ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే సాధ్యమని, తెలంగాణ రాష్ర్టంలో తొలిసారిగా గ్రూప్-1 పోస్టులు భర్తీ చేసి ప్రజాప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. ఉమ్మడి రాష్ర్టంలోనూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంలోనూ గ్రూప్--1 పరీక్షలు నిర్వహించి నియామకాలు జరిపిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టీజీపీఎస్సీని పూర్తిగా నిర్వీర్యం చేశారని, అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూప్--1, గ్రూప్--2 నోటిఫికేషన్లు జారీ చేయడమేకాకుండా ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తోందన్నారు. ఏడాదిన్నరలోనే దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
ఇది చూసి ఓర్వలేని కొంతమంది ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ఒక ఆదాయ వనరుగానే చూసిందని, ప్రజాప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. కార్పొరేట్కు దీటుగా అత్యంత ఆధునిక వసతులతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు.