2 September, 2026 | 8:36 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

గ్రూప్-3 సజావుగా నిర్వహించాలి

14-11-2024 | 01:17am

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఈనెల 17, 18వ తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్య ర్థులు హాజరుకానున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సీఎస్ బుధవారం టీజీపీఎస్సీ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆమె మాట్లాడుతూ మొత్తం 1,401 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. 

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి..

గతానికి మించి వరి దిగుబడి వస్తున్నందున క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్లను ఆదేశించారు. గోదాంలకు ధాన్యం రవాణా చేసి, రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. కొత్తగా మంజూరైన నర్సింగ్ కాలేజీల్లో మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు.