26 June, 2026 | 6:45 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

పిడుగుపాటుకు జీటీ ట్రాన్స్‌ఫార్మర్ బుగ్గి

30-06-2024 01:12 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 29 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో శనివారం రాత్రి పిడుగు పడి  జీ టి (జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్) దగ్ధ్దమై పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. యూనిట్‌లో తయారైన  విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేయడానికి ఈ ట్రాన్స్‌ఫార్మర్ దోహదపడు తుంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే ఒకటో యూనిట్‌ను ముందుజాగ్రత్తగా నిలిపివేశారు.

ఘటన స్థలానికి సీఈ బిచ్చన్న, ఎస్‌ఈలు చేరుకొని వివరాలు సేకరిస్తు న్నారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఘటనలో జెన్‌కోకు సుమారు రూ.100 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పిడుగు పడిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం తో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.