calender_icon.png 19 February, 2026 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ గురుకుల విద్యార్థినుల ఆందోళన

19-02-2026 01:44:49 AM

కల్వకుర్తి ఫిబ్రవరి 18: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కేంద్రంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు . కళాశాల ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేసి సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కళాశాలలో ప్రిన్సిపాల్ వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు.

నాసిరకమైన భోజనం అందిస్తున్నారని, మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే దూషణలకు గురిచేస్తున్నారని వారు తెలిపారు. విద్యార్థినులు హైదరాబాద్‌శ్రీశైలం ప్రధాన రహదారిపై, ఆందోళన చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినులతో చర్చించి అక్కడినుండి కళాశాల వద్దకు తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.