సీబీఐటీలో హ్యకథాన్ హ్యాక్ ఎక్స్ సెలేట్

27-04-2024 02:21:49 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : రోజురోజుకు పెరుగు తున్న నూతన టెక్నాలజీతో అప్‌డేట్ అవుతూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని సీబీఐటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీవీ నర్సింహులు, సీబీఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. సుశాంత్ బాబు అన్నారు. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, బైట్ ఎక్స్‌ఎల సహకారంతో గండిపేట్ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాతీయస్థాయి హ్యాకథాన్ హ్యాక్ ఎక్స్ సెలేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 139 బృం దాలు హ్యాకథాన్ కోసం నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకే తిక రంగంలో నూతన ఆవిష్కరణ లు, సహకారాన్ని పెంపొందిం చుకో వాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బ ంది, బృందాల సభ్యులు పాల్గొన్నారు.