ఆదిలాబాద్‌లో పోలీసుల తనిఖీలు

27-04-2024 02:23:34 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 26 (విజయ క్రాంతి): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో మద్యం, గంజాయి, డబ్బు అక్రమంగా తరలించకుండా తనిఖీలు చేస్తున్నామని ఎస్పీ గౌష్ అలం పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలు, వాహనాల్లో ప్రత్యేక బృందంలతో కలిసి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలను ఎస్పీ స్వయంగా తనిఖీలు చేశారు. అదేవిధంగా జిల్లాలో మాదకద్రవ్యాలను సంపూ ర్ణంగా రూపుమాపాలనే లక్ష్యంతో తనిఖీలు చేశామని తెలిపారు.