31-05-2025 12:00:00 AM
- పాకిస్థాన్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు
- వాళ్లు ఆడిన ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసింది
- మరోసారి తప్పుచేస్తే పాక్ కోలుకునే అవకాశమివ్వం
- ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి
ముంబై, మే 30: పాకిస్థాన్ చర్చలకు సిద్ధంగా ఉంటే మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ లాంటి కరుడు గట్టిన నేరస్తులను ముందు భారత్కు అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిం చా రు.
శుక్రవారం భారత నౌకాదళానికి చెందిన విమాన వాహకనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ను రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా నౌకాదళ అధికా రులతో మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ శక్తిమంతమైన దాడులు చేయడంతో భారత్ను ఆపాలని పాకిస్థాన్ ప్రపంచ దేశాలను వేడుకుందన్నారు.
అయితే నిబంధనల ప్రకారమే సైనిక చర్యలను ఆపేశామని తెలిపారు. దాడులకు భయపడిన పాకిస్థాన్ చర్చలకు సిద్ధమని తెలిపిందని, అయితే దానికి ముందు వారి దేశంలో తలదాచుకున్న కరుడు గట్టిన ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు పాక్ ఆడుతూ వచ్చిన ప్రమాదకర ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసిందని రాజ్నాథ్ పేర్కొన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ సమయం లో నేవీ పాత్ర అద్భుతమైనదని కొనియాడారు. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను వైమానిక దళం నేలమట్టం చేసిందని, అదే సమయంలో నావికాదళం సముద్రంలో చూపిన సంసిద్ధత పాక్ నావికాద ళాన్ని ఎక్కడికీ కదల కుండా తీరానికి పరిమితం చేయడంలో సమర్థవంతమైన పాత్రను పోషించారన్నారు.
పాక్పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే కేవలం సన్నద్ధతతోనే దాయాదికి గట్టి హెచ్చరికలు పంపించారని తెలిపారు. భారత త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను చూసి శత్రుదేశం భయాందోళనకు గురైందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ము గియలేదని, ఇది చిన్న విరామం మాత్రమేనని అన్నారు. పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఈసారి కోలుకునే అవకాశం కూడా ఇవ్వమని రాజ్నాథ్ హెచ్చరించారు.