18-07-2025 12:00:00 AM
సంఘం రాష్ట్ర నాయకులు కర్నాటి వెంకటేశం
చండూరు, జులై 17 ( విజయ క్రాంతి): జియో ట్యాగ్ ఉన్న చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా కల్పించాలని, చేనేత రుణమాఫీలో నిబంధనలు సడలించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కర్ణాటి వెంకటేశం అన్నారు. గురువారం గట్టుపల్ మండల కేంద్రంలో చేనేత కార్మికులు నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల మగ్గాలకు, జియో ట్యాగ్ కలిగిన చేనేత కార్మికులకురూ. 18000 వేలు, అనుబంధం కార్మికునికిరూ. 6000 వేలు వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి చేనేత కార్మికునికి నిబంధనలు లేకుండా రుణ మాఫీ చేయాలని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని ఆయన అన్నారు.
చేనేత చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలని, చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. అర్హులైన నేత కార్మికులకు జియో ట్యాగ్ నెంబర్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు చెరుపల్లి సత్తయ్య, ఇడెం బుచ్చయ్య, రాపోలు సత్తయ్య, గడ్డం నరసింహ, కుకుడాల అశోక్, చెరుపల్లి చంద్రమౌళి, జెల్ల మారయ్య, చెరుపల్లి కృష్ణయ్య, డోర్నాల నరసింహ, శంకరయ్య, గంజి పెద్దలు, కర్నాటి యాదయ్య, సామల అంజయ్య, పెదగాని నరసింహ, జెల్ల పరమేష్ పాల్గొన్నారు.