10-08-2025 04:46:10 PM
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
చండూరు,(విజయక్రాంతి): ఎలాంటి షరతులు లేకుండా జియో టాక్ కలిగిన చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా కల్పించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ అన్నారు. ఆదివారం గట్టుపల్ మండల కేంద్రంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం గట్టుప్ప ల మండల మహాసభ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కర్నాటి వెంకటేశం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికుల మరియు సహకార సంఘాల దగ్గర నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.
చేనేత కార్మికుల, సహకార సంఘాల ద్వారా నేసిన వస్త్రాలు మార్కెట్ సౌకర్యం లేక నిలువలు పేరుకపోయి ఉపాధి లేక నేసిన కూలి గిట్టుబాటు దాకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. చేనేత సహకార సంఘాలు తీసుకున్న రుణాలను క్యాష్ క్రెడిట్ మాఫీ చేయాలని, చేనేత కార్మికులకు రుణం ఎంత ఉన్నా ప్రభుత్వం ఇస్తానన్న రూ.లక్షను ఎలాంటి శరత్తులు లేకుండా అమలు చేయాలని ఆయన అన్నారు. రుణమాఫీ విషయంలో లక్ష రూపాయలకు పైగా రుణాలు ఉన్న ప్రభుత్వం మాఫీ చేస్తానని ఇంతవరకు మాఫీ చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ప్రింట్ చీరలు తయారవుతున్న వాటిని అరికట్టి చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆయన అన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కర్నాటి మల్లేశం మాట్లాడుతూ,చేనేత కార్మికుల కుటుంబాలకు అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన అన్నారు.
చేనేత కార్మికులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని, చేనేత కేంద్రాలలో యారన్ డిపోలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. అర్హత కలిగిన చేనేత కార్మికులకు ఇల్లు లేని పేదలకు120 గజాల స్థలం ఇచ్చి కేంద్రం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చి హౌస్ కంవర్క్ షెడ్ నిర్మాణం చేయాలన్నారు. ఈ మండల మహాసభలోపై తీర్మాలను ఏకగ్రీవంగా తీర్మానం చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కర్నాటి మల్లేశం, కర్ణాటి వెంకటేశం, కందగట్ల గణేష్, భావండ్ల ఆంజనేయులు, చెరుపల్లి సత్యనారాయణ, పున్న కిషోర్, అందెం రాములు, చెరుపల్లి కృష్ణయ్య, మందుల శంకర్, కర్నాటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.