16 May, 2026 | 1:08 AM

ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూమి హక్కు పత్రాలు అందజేత

16-05-2026 12:00 AM

కోహెడ, మే 15: కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో నిర్మిస్తున్న హుస్నాబాద్ నియో జకవర్గస్థాయి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రభుత్వ స్థలం యొక్క భూమి హక్కు పత్రాలను తహసీల్దార్ నవీన్ కుమార్ జిల్లా విధ్యాధికారి శ్రీనివాస్ రెడ్డి కి అందిం చారు. ఈ సందర్బంగా జిల్లా విద్యాధికారి శ్రీ ఇ.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల నిర్మాణం వేగంగా జరుగుతుందని, ఈ పాఠశాల 2027-28 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందు బాటులోకి వస్తుందన్నారు.

పాఠశాల నిర్మాణానికి గ్రామస్తులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. రెవిన్యూ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు.  తహసిల్దార్ నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ బోయిని సంపత్, గిరిధావన్ ఎల్లయ్య, సెక్టోరల్ అధికారి రామస్వామి, గ్రామస్తులు బండిపెల్లి నారాయణ, పాము శ్రీకాంత్, పిల్లి రాజు, అబ్దుల్ రఫీ, పిల్లి సత్యనారాయణ, జిపిఓ వనిత, సిఆర్పి రాజేశం, పాల్గొన్నారు.