16-11-2025 10:18:55 PM
తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా!!
శివంపేట్ (విజయక్రాంతి): సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మండల పత్రిక విలేకరులకు జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు అని శివంపేట మండల ఆపద్బాంధవుడు, సంఘ సేవకులు, తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని ఆర్థిక రాజకీయ సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి ఏ స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు నే కోరుకుంటారు అని తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అన్నారు.