15-08-2025 12:00:00 AM
భారత ప్రధాని జాతీయ జెండాకు ప్రాధాన్యత కల్పించడానికి ‘హర్ ఘర్ తిరంగా’ నినాదంతో పౌరులను చైతన్య పరచడానికి 2022లో పౌరులందరూ తమ ఇళ్లపై జెండా ఎగురవేసే అవకాశం కల్పించారు. ‘హర్ ఘర్ తిరంగా’ నినాదంతో ఇళ్లపై జెండాలు ఎగరేస్తున్నప్పటికీ పతాక నియమావళి అతిక్రమిస్తున్నారు. నేడు చాలా ఇళ్లపై మాసిపోయిన జెండాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. పౌరులు జాతీయ పతకానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మరిచిపోతు న్నారు. నియమావళి ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలి.
వెంకటరమణమూర్తి, హైదరాబాద్