calender_icon.png 17 June, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుడిని హింసించడం బాధాకరం: హరీశ్ రావు

11-07-2024 04:57:07 PM

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్ సురేష్ కుమార్ అనే గిరిజనుడిని హింసించడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. తొర్రూరు పోలీసుల తీరును హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకోని, విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని మండిపడిన హరీశ్ రావు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.