calender_icon.png 20 August, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా బతికిన రైతన్నకు.. యూరియా కోసం కాళ్ళు మొక్కే దుస్థితి

20-08-2025 12:50:59 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో రైతులను తీవ్రమైన యూరియా కొరతతో కష్టాల్లోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వ్యవసాయ సంక్షోభం వైపు పయనిస్తోందని ఆయన హెచ్చరించారు. పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో దర్జాగా బతికిన రైతన్నకు నేడు కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి వచ్చిందని అన్నారు. ఎరువుల పంపిణీ కేంద్రంలో రైతు  అధికారి కాళ్లను తాకిన వీడియోపై ఆయన బాధ వ్యక్తం చేశారు. ఒక్క ఎరువుల సంచి కోసం రైతులు కన్నీళ్లతో కురుస్తున్న వర్షంలో పొడవైన క్యూలలో నిలబడవలసి వస్తుందని ఆయన ఎత్తి చూపారు. “ఈ ప్రభుత్వం రైతులకు నిరాశను మిగిల్చిందిఅని ఆయన వ్యాఖ్యానించారు.