calender_icon.png 6 June, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అంటే లెక్కలేదు.. దేవుళ్ళంటే లెక్కలేదు: హరీశ్ రావు

04-06-2025 09:11:04 PM

నర్సాపూర్,(విజయక్రాంతి): వేములవాడ రాజన్న దేవాలయం(Vemulawada Rajanna Temple)లో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టామని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్నొన్నారు. బుధవారం నర్సాపూర్ నియోజకవర్గలో పర్యటించిన హరీష్ రావు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వాపోయ్యారు. రోజుకోక్క కోడె చనిపోతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా, కనీస స్పందించడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డిపెట్టే పరిస్థితి లేదా..? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్టు..?, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? అని అడిగారు. కోడెలను కాపాడలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండని, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కు ప్రజలు అంటే లెక్కలేదు, దేవుళ్ళంటే లెక్కలేదు.. అని విరుచుకుపడ్డారు.