05-06-2025 12:32:55 AM
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం నుంచి తిరిగి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం (ఈనెల 6న) మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ విచారణ జరగనుంది.
ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరుకానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 11న విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో కమిషన్ కీలకమైన ఈ విచారణలకు తగ్గట్లుగా సన్నద్ధమవుతున్నట్లు సమాచారం