29-05-2025 01:39:25 AM
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీరుపై ఆర్టీసీ జేఏసీ అనుమానం
- ప్రభుత్వ సూచన మేరకు సమ్మె విరమించినా ఫలితం శూన్యమనే భావన
- కార్మికులకు ఇష్టంలేని వెల్ఫేర్ కమిటీ మీటింగ్ నిర్వహించిన ఆర్టీసీ ఎండీ
- ప్రభుత్వ అనుమతి లేకుండా వెల్ఫేర్ కమిటీ సమావేశం జరిగేనా?
- జూన్ 2 లోపు హామీలు అమలు చేయకుంటే సమ్మె తప్పదంటున్న జేఏసీ
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): ఆర్టీసీ జేఏసీ ఈ నెల 7వ తేదీన చేపట్టిన ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వ హామీతో విరమించుకు న్నా.. ఫలితం లేకుండా పోయిందని, తాము నమ్మి మోసపోయా మనే భావనలో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఉన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మె విరమించుకున్నా తమ డిమాండ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కారం అయ్యిందో లేదో కానీ కార్మికులు తమ హక్కుగా భావిస్తున్న ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరణ చేయలేదు.
పైసా ఖర్చు కాని ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణ సంగతి అటుంచి కార్మికు లు ఎప్పటినుంచో వ్యతిరేకిస్తూ వస్తున్న వెల్ఫేర్ కమిటీల రాష్ట్రస్థాయి స్థాయి సమావేశాన్ని ఈ నెల 27న సంస్థ ఎండీ సజ్జనార్ నిర్వహించారు. కార్మికులను విచ్ఛిన్నం చేస్తూ వారి హక్కులను కాలరాసేందుకు యాజమాన్యం చెప్పినట్లు వినేవారిని ప్రతీడిపోకు వెల్ఫేర్ కమిటీల పేరిట ఏర్పాటు చేసి తమ సం క్షేమానికి కట్టుబడినట్లుగా పేర్కొనడంపై ఆర్టీసీ జేఏసీ మండిపడు తోంది.
ఆర్టీసీ జేఏసీ తమకు తీవ్ర అన్యా యం జరుగుతోందని భావిస్తున్న తరుణంలో వారికి ఏమాత్రం ఇష్టం లేని వెల్ఫేర్ కమిటీల రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేశా రంటే అందుకు ఎండీ ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం అయి ఉండద ని.. కచ్చితంగా ప్రభుత్వ అనుమతితోనే జరిగి ఉంటుందని ఆర్టీసీ జేఏ సీ అంచనా వేస్తోంది.
పైపెచ్చు ఈ వెల్ఫేర్ కమిటీ మీటింగులో కార్మికసంఘాలను ఎండీ పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. తమ మనుగడ కోసం కొందరు గత నాలుగైదు నెలలుగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా ఉద్యోగు లు ఎంతో సంయమనంతో ఉన్నారంటూ ఆయన ప్రసంగించారు.
కొన్ని గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమైన తాము..ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమిస్తే తమకు దక్కిన ప్రతిఫలం ఇదా అని ఆర్టీసీ జేఏసీ అంటోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులు, వారి సమస్యలపై సానుకూలంగా ఉన్నా కానీ సంస్థకు చెందిన ఓ కీలక అధికారి వారిని తప్పుదారి పట్టిస్తూ కార్మికులను ఆగం చేస్తున్నారని జేఏసీ అంటోంది. ఇప్పటికే యాజమాన్యానికి, ప్రభుత్వానికి తాము తగిన గడువు ఇచ్చామని..జూన్ 2 లోపు సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె తప్పదని ఆర్టీసీ జేఏసీ హెచ్చరిస్తోంది.
ఇచ్చిన హామీలు నెరవేర్చని ఫలితంగా..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఎన్నో హామీలిచ్చింది. ఆర్టీసీని ఆదుకుంటామని ప్రకటించింది. సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే వారు హామీలు ఇచ్చినవాటిలో ప్రజలకు వెంటనే ప్రయోజనం కలిగేలా మహాలక్ష్మిఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మహిళలు ఎంతో చేరువయ్యారు. సర్కారు కూడా ప్రచారం చేసుకునేందుకు ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడింది. బస్సులు, సిబ్బందిని పెంచకుండా ఫ్రీ బస్సు స్కీమ్ను నడిపించడంతో డ్రైవర్లు, కండక్టర్లపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. ప్రయాణికులతో గొడవలు, బస్సు బ్రేక్ డౌన్లు, 40మంది ఎక్కే బస్సులో రెండు బస్సుల జనాలు..ఇలా ఎన్నో సమస్యలను అధిగమిస్తూ సిబ్బంది విధులు నిర్వహిస్తూ వస్తున్నారు.
అయితే ఇంత కష్టపడినా కూడా తమకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని కార్మికులు భావించడం ప్రారంభమైంది. దీనికితోడు ప్రభుత్వం క్రమంగా కేంద్రం పాలసీ పేరు చెబుతూ కార్పోరేట్ సంస్థల ద్వారా విద్యుత్ బస్సులను తీసుకొచ్చింది. ఫలితంగా ఒక్క కండక్టర్ మినహా.. డ్రైవర్ సహా మిగతా సిబ్బంది ఉద్యోగాలకు భరోసా లేకుండాపోయింది. పైపెచ్చు నగరంలో కొన్ని డిపోలను ఇప్పటికే కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టడం ప్రారంభమైంది.
ఈ ఘటనలన్నీ కార్మికుల ఆందోళనకు కారణమైంది. కేసీఆర్ హయాంలో తీసేసిన ట్రేడ్ యూనియన్ గుర్తింపును కూడా రేవంత్ సర్కారు పునరుద్ధరించకపోవడంతో కార్మికులంతా మళ్లీ ఐక్యమయ్యారు. ఆర్టీసీ జేఏసీగా ఏర్పడ్డారు. సమస్యలకు పరిష్కారం కేవలం సమ్మె ద్వారా మాత్రమే సాధ్యమని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె నోటీసు ఇచ్చారు.
సమ్మె విరమించినా ఫలితం లేకపాయే..
జనవరిలో ఇచ్చిన సమ్మె నోటీసుకు యాజమాన్యం స్పందించలేదు. కార్మికశాఖ నుంచి చర్చలకు పిలిచినా ఎన్నికల కోడ్ సాకుగా చూపి తప్పించుకుంది. దీంతో అవకాశం కోసం చూసిన ఆర్టీసీ జేఏసీ..ఈసారి చాలా పకడ్బందీగా సమ్మెకు సిద్ధమైంది. మే 7న సమ్మెకు దిగుతున్నట్లు ఏప్రిల్ 7వ తేదీన యాజమాన్యానికి, కార్మికశాఖకు ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది.
నెలరోజుల వ్యవధి ఉండటంతో డిపో మీటింగులు, వివిధ సమావేశాలు ఏర్పాటు చేసుకుని జేఏసీ సమ్మెకు బలంగా సిద్ధమైంది. ఇక మే 7న సమ్మె ఉంటుందని భావించి కార్మికులు కూడా మానసికంగా సిద్ధమయ్యారు. ఇక సమ్మె తప్పదని భావించిన సర్కారు పెద్దలు చివరి అస్త్రంగా తమ ప్రతినిధిగా వచ్చిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును ఆర్టీసీ జేఏసీతో చర్చలకు పంపింది. ఆ యన హామీతో జేఏసీ సందిగ్ధంలో పడింది.
కూనంనేని మధ్యవర్తిగా వచ్చారు కాబట్టి ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయా లు తీసుకుంటుందని భావించిన జేఏసీ స మ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది. చాలామంది కార్మికులు జేఏసీ నిర్ణయంపై కాస్త ఆవేదన చెందారు. సమ్మె చేస్తేనే ప్రభుత్వానికి తమ విలువ తెలుస్తుందని అప్పుడు ప్ర భుత్వ పెద్దలు దిగివచ్చి హామీలు నెరవేరుస్తారని భావించారు.
కానీ సమ్మెవిరమణ వారి ని నిరాశకు గురిచేసింది. సమ్మె విరమించిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీతో చర్చలు జరిపి కచ్చితంగా కార్మికులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుం టుందని చెప్పి పంపించారు. కానీ 23 రోజు లు దాటినా ఫలితం లేకుండాపోయింది.
దేవుడు వరమిచ్చినా..
ఆర్టీసీ సమ్మె కు సర్వం సిద్ధమై న సమయంలో ప్రభుత్వం సమస్యలను పరిష్కరి స్తామని హామీ ఇచ్చినందుకే సమ్మె విరమించాం. ఆర్టీసీపై ప్రభుత్వానికి సానుకూల దృక్పథమే కనిపిస్తోంది. కానీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉద్దేశపూర్వకంగా సర్కారును పక్కదారి పట్టి స్తున్నారు.. ఆయనకు కార్మికుల సమస్యలు పరిష్కారం అవ్వడం ఇష్టం లేదనిపిస్తోంది.
ట్రేడ్ యూనియన్ గుర్తింపును ఇవ్వకుండా వెల్ఫేర్ కమి టీ మీటింగ్ పెట్టడంలో ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. సమ్మె విరమణకు మధ్యవర్తిత్వం వహించిన ఎమ్మె ల్యే కూనంనేని ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలి.
-ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్
హామీ ఇచ్చి మోసం చేయడం తగదు..
ఆర్టీసీ కార్మికులు, జేఏసీకి ఏమాత్రం ఇష్టం లేని వెల్ఫేర్ కమిటీల మీటింగ్ను ఏర్పాటు చేయడమే కాకుండా ఆర్టీసీ కార్మికులపై విమర్శలు చేయడం తగదు. ఇది మమ్మల్ని ఆగ్రహానికి గురిచేసేలా ఉంది. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇది జరిగే పనికాదని భావిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు కూడా త్వరలో సమ్మెకుపోవాలనే ఆలోచనలో ఉన్నారు.
వారితో పాటు ఆర్టీసీ జేఏసీ కూడా సమ్మెకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాం. కూనంనేని మధ్యవర్తిగా వచ్చి మా సమ్మెను ఆపేలా ఒప్పించారు. కానీ ఇప్పుడు మా సమస్యలపై ఎవరూ స్పందించడం లేదు. ఇది న్యాయం కాదు. హామీ ఇచ్చి మోసపూరితంగా వ్యవహరించడం కరెక్టు కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి జూన్ 2లోపు మా సమస్యల పరిష్కారంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆ తర్వాత సమ్మెకు పోవడం మినహా ప్రత్యామ్నాయం లేదు.
-థామస్రెడ్డి, ఆర్టీసీ జేఏసీ వైస్చైర్మన్