1 July, 2026 | 9:01 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అరవొద్దన్నందుకు చంపేశాడు

03-12-2024 03:00 AM

నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలో ఘటన

కాప్రా, డిసెంబర్ 2: నెమ్మదిగా మాట్లాడమని అన్నందుకు ఓ వ్యకిని దారుణంగా కొట్టిచంపిన ఘటన నేరేడ్‌మేట్ పీఎస్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఓల్డ్ నేరడ్‌మెట్ వినాయక్‌నగర్‌లో నివాసముండే బండారి రాము(36) స్థానికంగా సెట్రింగ్ పనులు చేస్తుంటాడు.

కాగా సోమవారం సాయంత్రం రాము తన ఇంటి సమీపంలోని పాన్ డబ్బాకు వచ్చి పాన్‌మసాల కొనుగోలు చేస్తుండగా అటుగా వచ్చిన శ్రీకాంత్ పాన్‌డబ్బా వద్ద పాన్‌మసాల కావాల్సిందిగా గట్టిగా అరిచాడు. గట్టిగా ఎందుకు అరుస్తున్నావ్ అని బండారి రాము అనడంతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ .. రాముపై పిడిగుద్దులు గుద్దాడు. ఇష్టం వచ్చినట్లు దాడిచేయడంతో బండారి రాము అక్కడే కుప్పకూలిపోయాడు.

అనంతరం శ్రీకాంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా బండారి రాము మృతిచెంది ఉన్నాడు. శ్రీకాంత్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.