1 July, 2026 | 7:59 PM

Breaking News

పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •  

విజృంభిస్తున్న మరో మహమ్మారి

03-12-2024 03:01 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: బ్లీడింగ్ ఐ వైరస్ బారినపడి రువాండాలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వైర స్ సోకి వందలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 17దేశాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్న ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవాళ్లు అప్ర మత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

వైరస్ ఆనవాళ్లు కనిపించిన దేశాలను డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తం చేసి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మార్‌బర్గ్ వైరస్ అని కూడా పిలిచే ఈ వైరస్ గబ్బిలాల్లో ఆవాసం ఉంటుంది. ఈ వైరస్ మూత్రం, లాలాజలం, రక్తం ద్వారా వ్యాపిస్తుంది.

వైరస్ సోకిన వ్యక్తులు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ముక్కు, కళ్లు, మలమూత్రాల ద్వారా రక్తాన్ని కోల్పోతారు. దీన్ని తగ్గించడానికి సరైన చికిత్స అందుబాటులో లేదు.