30-05-2025 11:44:37 AM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) మే నెలలోనే భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఎగువన కురుస్తున్న ముందస్తు భారీ వర్షాల నేపథ్యంలో జూరాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమై జూరాల ప్రాజెక్టు(Jura Project) ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం 38.9150 టిఎంసి నీరు నిల్వ ఉండగా సుంకేశుల నుంచి 8,824 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు నుంచి 97,659 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. దీంతో శుక్రవారం ఉదయం 818.20 అడుగుల వద్దకు చేరి 38.9150 టిఎంసి నీరు నిల్వకు చేరింది. ఈ అధిక ప్రవాహాన్ని గమనించిన అధికారులు అప్రమత్తమయ్యారు.