calender_icon.png 31 May, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు రాలేదని.. వ్యక్తి ఆత్మహత్య

30-05-2025 12:55:17 PM

తీవ్ర మనస్థాపంతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్మరణం 

రంగారెడ్డి జిల్లా, యాచారంలో మండలంలో ఘటన 

యాచారం: ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District), యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. దీనికి సంబంధించి సిఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (44) అనే వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma house)దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి సొంతిల్లు లేకపోవడంతో ఇందిరమ్మ లిస్టులో అతని పేరు సైతం వచ్చింది.  కానీ చివరిలో తన పేరు లిస్టులో లేకపోవడంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గ్రామంలో ఇల్లు మంజూరైన వారందరూ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసుకొంటున్నారు.  కానీ అశోక్ పేరు లేకపోవడంతో అతను ఆవేదన చెందాడు.  ఇంట్లో తెల్లవారుజామున ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  నా చావుకు కారణం ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేసిన కాంగ్రెస్ నాయకులు అని తన చేతిపై రాసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు.  అతనికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.