01-06-2025 12:35:36 AM
- గుట్టు చప్పుడు కాకుండా పూడ్చివేత?
- వేములవాడ గోశాలలో సామర్థ్యానికి మించి కోడెలు!
- కోడెలకు సరిపోని పశుగ్రాసం
వేములవాడ, మే 31 (విజయక్రాంతి): వేములవాడ తిప్పాపూర్లోని గోశాలలో గత రెండు రోజుల్లో ౧౪ కోడెలు మృత్యువాతపడ్డ ట్టు తెలుస్తున్నది. శుక్రవారం ఎనిమిది, శనివా రం ఆరు చనిపోయాయని స్థానికులు చెపుతున్నారు. మృతిచెందిన కోడెలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టారని ఆరోపిస్తున్నారు.
తిప్పాపూర్ గోశాలలోని షెడ్లలో సామర్థ్యానికి మించి కోడెలు ఉన్నాయని తెలుస్తున్నది. 12 షెడ్లలో ప్రస్తుతం సుమారు 600 వరకు కోడె ల పాలన చూసేందుకు అవకాశం ఉంది. కానీ కొద్దిరోజుల నుంచి రైతులకు ఉచితంగా కోడె లు అందించే కార్యక్రమం నిలిచిపోవడం, భక్తు లు అప్పగించే కోడెల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో వాటి సంఖ్య 2 వేల వరకు చేరుకున్నదని తెలుస్తున్నది. వందల సంఖ్యలో ఉన్న కోడెల మధ్య తొక్కిసలాట జరగటం, అపరిశుద్ధ్యం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నాయి.
కొన్ని అనారోగ్యంతో అచేతనం గా పడిఉన్నా చికిత్స అందించడంలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. గోశాలకు రోజు కు నిత్యం 400 కోడెలకు మాత్రమే పచ్చి గడ్డి సమకూరుతుండగా, అక్కడున్న మొత్తం కోడెలకు ఆ గ్రాసం సరిపోవడం లేదని తెలుస్తున్న ది. ఇటీవల కురిసిన వర్షాలకు గోశాల మొత్తం బురదమయంగా మారిందని కూడా తెలుస్తున్నది.
భక్తులు ఏటా చెల్లించే కోడె మొక్కుల ద్వారా ఆలయానికి రూ.కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ, కోడెల సంరక్షణను ఆలయ అధి కారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొందరు గోశాలలో 1,200కు పైగా కోడెలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి అక్కడ 2 వేల వరకు ఉన్నట్లు సమాచా రం. కోడెల సంరక్షణకు దేవదాయ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
అకాల వర్షాలు, అనారోగ్యంతో కోడెల మృతి: కలెక్టర్
అకాల వర్షాలు, అనారోగ్య కారణాలతోనే ఎనిమిది కోడెలు మృతి చెందాయని సిరిసిల్ల కలెక్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపా రు. తిప్పాపూర్లోని గోశాలను కలెక్టర్ శనివా రం తనిఖీ చేశారు. పశువైద్యాధికారులు, సిబ్బంది గోశాలకు చేరుకుని కోడెల మృతికి గల కారణాలను గుర్తించే పనిలోపడ్డారు.
అనారోగ్యంతో ఉన్న కోడెలకు చికిత్స అందిస్తున్నా రు. ఈ సందర్భంగా గోవులకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, పరిసరాలను పరిశీలించి, కలెక్టర్ మాట్లాడారు. గోశాలలోని కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. శనివారం కోడె లు మృతి చెందలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. పశు వైద్యాధికారులు అంజిరెడ్డి, రాహుల్, అభిలాష్, సాహితి, దీప్తి ఆద్వర్యంలో కోడెలకు నిరంతరం వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
కోడెల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. నిత్యం వాటికి అందించే దాణా, మేత విషయాన్ని జా గ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. నిత్యం పచ్చి గడ్డి పెట్టాలని, గోశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించా రు. త్వరలో కోడెల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రస్తుతం 450 కోడెల సామర్థ్యం ఉన్న షెడ్లలో 1,200 లకు పైగా కోడెలు ఉన్నట్టు తెలుస్తున్నది. రైతులకు ఉచితంగా కోడెల పం పిణీ ప్రకియ నిలిచిపోవటం, భక్తులు అప్పగిం చే కోడెల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో గోశాల పరిమితి సరిపోవటం లేదు. వందల సంఖ్యలో ఉన్న కోడెల మధ్య తొక్కిసలాట జరగటం, అపరిశుద్ధ్యం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నాయి.