calender_icon.png 13 November, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హలో బీసీ.. చలో కామారెడ్డి

13-11-2025 11:47:43 AM

కామారెడ్డి బిసి ఆక్రోశ సభను విజయవంతం చేయాలి 

హన్మకొండ,(విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి(BC Reservation Implementation Committee) ఆధ్వర్యంలో జస్టిస్ ఈశ్వరయ్య చీఫ్ జస్టిస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్, చిరంజీవిలు ఐఏఎస్ రిటైర్డ్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర చైర్మన్, డాక్టర్ విశారదన్ మహరాజ్ బీసీ ఎస్సీ ఎస్టీ. జేఏసీ రాష్ట్ర కన్వీనర్, బాలరాజు గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేట్ ప్రెసిడెంట్ ల పిలుపు మేరకు నేడు వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించి కామారెడ్డి బీసీ ఆక్రోష సభ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.

42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయుటకు 9వ షెడ్యూల్లో చేర్చాలని, కామారెడ్డి డిక్లరేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 15 నవంబర్ 2025 న కామారెడ్డిలో జరగబోయే బీసీ ఆక్రోశ సభలో వరంగల్ జిల్లా లోని బీసీ, ఎస్సీ, ఎస్టి ప్రజలు విద్యావంతులు మేధావులు వివిధ సామాజిక వేదికలలో పనిచేస్తున్న నాయకులు విద్యార్థులు మహిళలు రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని 42 శాతం బీసీ రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికలలో సాధించుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ.జాక్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య, డాక్టర్ కూరపాటి రమేష్ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం కార్యదర్శి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ కోఆర్డినేటర్ మేకల సుమన్, డాక్టర్ కే వీరస్వామి, ఇంటలెక్చువల్ ఫోరం చీఫ్ కోఆర్డినేటర్ ఇస్లావత్ మోహన్ నాయక్, సేవాలాల్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు మూడు వీరన్న నాయక్ జిల్లా నాయకులు హనుమకొండ జిల్లా కార్యదర్శి గుగులోతు రాజన్న నాయక్, ఆర్గనైజర్ గొల్లపల్లి సురేష్ గౌడ్, జిల్లా పద్మశాలి సంఘం నాయకులు మాటేటి బాలకృష్ణ,  కిరణ్ పద్మశాలి, ఎం జె ఎస్ జిల్లా అధ్యక్షులు సిలువేరు రవి,వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ కట్కూరి సునీల్, కెమ్ సత్తి, నాగరాజు, జిల్లా నాయకులు రొడ్డ మురళీకృష్ణ, దామెర శ్రావణ్, ఇల్లందుల సుమన్, జన్ను కళ్యాణ్ పాల్గొన్నారు.