9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు నివాళి

25-04-2024 02:18 AM

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహించి ఇటీవల కన్నుమూసిన జస్టిస్ ఎ రామలింగేశ్వర రావుకు ఫుల్ కోర్టు బుధవారం ఘన నివాళులర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే అధ్యక్షతన బుధవారం ఫుల్ కోర్టు ప్రత్యేకంగా సమావేశమై జస్టిస్ రామలింగేశ్వర రావుకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది.  న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఆయన చేసిన సేవలను సమావేశంలో కొనియాడారు.

ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఎ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజాప్రయోజనం, సామాజిక న్యాయానికి సంబంధించిన కేసు ల్లో రామలింగేశ్వరరావు కీలక తీర్పులకు కారణమయ్యారని తెలిపారు.  కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ నరసింహారెడ్డి, ఏఎస్జీ నరసింహ శర్మ, డీఎస్జీ గాడి ప్రవీణ్ కుమార్, పీపీ నాగేశ్వర రావు, ఏఏజీలు ఇమ్రాన్ ఖాన్, తేరా రజనీకాంత్ రెడ్డితో పాటు ఇతర కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ రామలింగేశ్వర రావు జర్మనీలో కుమార్తెను చూసేందుకు వెళ్లి అక్కడే ఈ నెల 5న తుది శ్వాస విడిచారు.