6 July, 2026 | 3:56 PM

Breaking News

విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •  

హోటల్ జప్తును సస్పెండ్ చేసిన హైకోర్టు

19-10-2024 01:48 AM

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని హోటల్ మెట్రో పొలిస్‌ను జప్తు చేయడాన్ని శుక్రవారం హైకోర్టు సస్పెండ్ చేసింది. అబ్దుల్ రషీద్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ తర్వాత జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హోటల్లో ఒక ఆలయంలో దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు బస చేశారంటూ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని పిటిషనర్ లాయర్ వాదించారు.

శాంతిభద్రతల సమస్య ఉందంటూ హోటల్ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవటం అన్యాయమని వాదించారు. హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యక్తిత్వ వికాస కోర్సును నిర్వహించడానికి 50 గదులు కేటాయించారని, అందుకోసం వచ్చిన మునవర్ జమా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు పోలీసుల చర్యను సస్పెండ్ చేసింది.