మున్సిపాలిటీ చైర్మన్ కు సన్మానం
27-02-2026 07:42 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ ను మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండా సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోతు సక్రు నాయక్, లాలి తండా సర్పంచ్ బాణోతు బాలు నాయక్ శుక్రవారం వారి చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.




